Tue May 07 2024 20:08:06 GMT+0000 (Coordinated Universal Time)
చైనా నుంచి తరలింపు
కరోనా వైరస్ బారిన చైనా పడటంతో అక్కడి నుంచి భారతీయులను తరలించారు. ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానంలో 324 మంది భారతీయులను ఢిల్లీకి తీసుకువచ్చారు. వారికి ఢిల్లీ [more]
కరోనా వైరస్ బారిన చైనా పడటంతో అక్కడి నుంచి భారతీయులను తరలించారు. ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానంలో 324 మంది భారతీయులను ఢిల్లీకి తీసుకువచ్చారు. వారికి ఢిల్లీ [more]
కరోనా వైరస్ బారిన చైనా పడటంతో అక్కడి నుంచి భారతీయులను తరలించారు. ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానంలో 324 మంది భారతీయులను ఢిల్లీకి తీసుకువచ్చారు. వారికి ఢిల్లీ విమానాశ్రయంలోనే వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. తర్వాత వీరందరినీ ఆర్మీ క్యాంపులకు తరలించనున్నారు. అక్కడ రెండు వారాల పాటు ఉంచి వైద్య పరీక్షలు చేస్తారు. కరోనా వైరస్ లేదని తేలితే బయటకు పంపుతారు. ఇప్పటి వరకూ చైనాలో కరోనా వైరస్ బారిన పడి 259 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. వుహాన్ లో ఉన్న భారతీయులను కొంతమందిని తరలించారు. మరికొందరిని చైనా నుంచి తీసుకువచ్చేందుకు ఈరోజు ప్రత్యేక విమానం చైనాకు వెళ్లనుంది.
Next Story