Tue Apr 30 2024 04:05:33 GMT+0000 (Coordinated Universal Time)
స్వతంత్రుల మద్దతు ఎవరికి..?
త్రిముఖ పోటీగా జరిగిన కర్ణాటక ఎన్నికల్లో ఇద్దరు స్వతంత్రులు మూడు పార్టీలను వెనక్కి నెట్టి తమ సత్తా చాటారు. అయితే ప్రస్తుతం అధికారం చేజిక్కించుకునేందుకు నంబర్ గేమ్ మొదలు కావడంతో ప్రతీ ఎమ్మెల్యే కూడా కీలకంగా మారారు. దీంతో ఈ ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఏ పార్టీ వైపు నిలబడతారన్నది సస్పెన్స్ గా మారింది. కాగా, వీరిద్దరి మద్దతును కూడగట్టడంలో కాంగ్రెస్ ఒకింత విజయవంతమైనట్లు కనిపిస్తొంది. రాణేబెన్నూర్ నుంచి స్థానిక కేపీజేపీ పార్టీ నుంచి గెలిచిన శంకర్ కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఇక మరో నియోజకవర్గం ముల్ బాగల్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన మాజీ కాంగ్రెస్ నేత నగేష్ కూడా తాను కాంగ్రెస్ వైపేనని స్పష్టం చేశారు. తాను కాంగ్రెస్ మనిషినని, ఆ పార్టీకే మద్దతిస్తానని తెలిపారు.
Next Story