Tue Mar 24 2026 02:17:37 GMT+0530 (India Standard Time)
రెండో విడతలో రీపోలింగ్ లేదు
ఆంధ్రప్రదేశ్ లో రెండో విడత పంచాయతీ ఎన్నికలలో ప్రజలు భారీ సంఖ్యలో పోలింగ్ లో పాల్గొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 81.67 శాతం పోలింగ్ నమోదయినట్లు [more]
ఆంధ్రప్రదేశ్ లో రెండో విడత పంచాయతీ ఎన్నికలలో ప్రజలు భారీ సంఖ్యలో పోలింగ్ లో పాల్గొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 81.67 శాతం పోలింగ్ నమోదయినట్లు [more]

ఆంధ్రప్రదేశ్ లో రెండో విడత పంచాయతీ ఎన్నికలలో ప్రజలు భారీ సంఖ్యలో పోలింగ్ లో పాల్గొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 81.67 శాతం పోలింగ్ నమోదయినట్లు అధికారులు వెల్లడించారు. అత్యధికంగా ప్రకాశం జిల్లలాలో 86.93 శాతం పోలింగ్ జరిగింది. శ్రీకాకుళం జిల్లాలో అత్యల్పంగా 72.87 శాతం పోలింగ్ జరిగింది. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని పంచాయతీ రాజ్ కమిషనర్ గిరిజా శంకర్ తెలిపారు. రీపోలింగ్ కు కూడా ఎక్కడా అవకాశం లేదని ఆయన తెలిపారు.
Next Story

