Mon Dec 15 2025 20:26:12 GMT+0000 (Coordinated Universal Time)
కోటకే సై అన్న కాషాయం
తెలంగాణలో రాజకీయ పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారిన హుజూర్ నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్ధిని అధికారికంగా ఖరారు చేసింది. ఇప్పటి వరకు బీజేపీ నుంచి శ్రీకళారెడ్డి [more]
తెలంగాణలో రాజకీయ పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారిన హుజూర్ నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్ధిని అధికారికంగా ఖరారు చేసింది. ఇప్పటి వరకు బీజేపీ నుంచి శ్రీకళారెడ్డి [more]

తెలంగాణలో రాజకీయ పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారిన హుజూర్ నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్ధిని అధికారికంగా ఖరారు చేసింది. ఇప్పటి వరకు బీజేపీ నుంచి శ్రీకళారెడ్డి బరిలోకి దిగుతారంటూ ప్రచారం సాగింది. అయితే అనేక తర్జన భర్జనలు సమాలోచనల తర్వాత పార్టీ అభ్యర్దిని ఖరారు చేసింది. హుజూర్ నగర్ అభ్యర్ధిగా కోట రామారావును ఎంపిక చేస్తూ రాష్ట్ర కార్యవర్గం జాతీయ పార్టీకి సిఫార్సు చేసింది. టికెట్ రేసులో శ్రీకళారెడ్డి తో పాటు మరో నలుగురు పోటీ పడ్డారు. చివరికి రామారావుకు టికెట్ దక్కింది.
Next Story
