Sat Dec 06 2025 01:03:08 GMT+0000 (Coordinated Universal Time)
అమిత్ షా అత్యవసర సమావేశం
ఢిల్లీలో జరిగిన అలర్ల నేపథ్యంలో కేంద్ర హోంమత్రి అమిత్ షా అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈశాన్య ఢిల్లీలో నిన్న అల్లర్లు చెలరేగి పెద్దయెత్తున ఘర్షణలు జరిగిన [more]
ఢిల్లీలో జరిగిన అలర్ల నేపథ్యంలో కేంద్ర హోంమత్రి అమిత్ షా అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈశాన్య ఢిల్లీలో నిన్న అల్లర్లు చెలరేగి పెద్దయెత్తున ఘర్షణలు జరిగిన [more]

ఢిల్లీలో జరిగిన అలర్ల నేపథ్యంలో కేంద్ర హోంమత్రి అమిత్ షా అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈశాన్య ఢిల్లీలో నిన్న అల్లర్లు చెలరేగి పెద్దయెత్తున ఘర్షణలు జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈశాన్య ఢిల్లీలో 144వ సెక్షన్ విధించారు. అయినా అల్లర్లు ఆగడం లేదు. నిన్నటి జరిగిన ఘటనలో మొత్తం ఏడుగురు మరణించారు. ఒక హెడ్ కానిస్టేబుల్ కూడా మృతి చెందారు. ట్రంప్ పర్యటన నేపథ్యంలో చెలరేగిన హింసాత్మక సంఘటనలపై అమిత్ షా సీరియస్ అయ్యారు. అమిత్ షా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, లెఫ్ట్ నెంట్ గవర్నర్ బైజల్, ఢిల్లీ పోలీస్ కమిషనర్, ఉన్నతాధికారులతో సమావేశమై అమిత్ షా పరిస్థితిని సమీక్షించారు.
Next Story

