Wed Jan 28 2026 18:07:23 GMT+0000 (Coordinated Universal Time)
అక్బర్, అసద్ లపై హిందూసేన?
ఎంఐఎం నేతలు అక్బరుద్దీన్, అసదుద్దీన్ లపై హిందూసేన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. అక్బరుద్దీన్, అసదుద్దీన్ లు విద్వేష పూరిత ప్రసంగాలు చేశారంటూ హిందూ సేన దాఖలు చేసిన [more]
ఎంఐఎం నేతలు అక్బరుద్దీన్, అసదుద్దీన్ లపై హిందూసేన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. అక్బరుద్దీన్, అసదుద్దీన్ లు విద్వేష పూరిత ప్రసంగాలు చేశారంటూ హిందూ సేన దాఖలు చేసిన [more]

ఎంఐఎం నేతలు అక్బరుద్దీన్, అసదుద్దీన్ లపై హిందూసేన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. అక్బరుద్దీన్, అసదుద్దీన్ లు విద్వేష పూరిత ప్రసంగాలు చేశారంటూ హిందూ సేన దాఖలు చేసిన పిటీషన్ ను ఢిల్లీ హైకోర్టు స్వీకరించింది. అక్బరుద్దీన్, అసదుద్దీన్ లపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని హిందూ సేన పిటీషన్ లో కోరింది. దీనిపై ఢిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఇద్దరిపై కేసు నమోదయ్యే అవకాశముంది.
Next Story

