Thu Jan 29 2026 22:37:00 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : జగన్ పై హత్యాయత్నం కేసులో కీలక పరిణామాలు

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసుపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. ఎయిర్ పోర్టులో లేదా ఎయిర్ క్రాఫ్ట్ లో ఎటువంటి నేరం జరిగినా ఎన్ఐఏ విచారణ జరపాలనే నిబంధన ప్రకారం ఈ కేసును ఎన్ఐఏకి బదిలీ చేయాలని జగన్ తో పాటు పలువురు పిటీషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి సీల్డు కవర్ లో నివేదిక సమర్పించాల్సిందిగా కోర్టు గత విచారణలో కేంద్రాన్ని ఆదేశించింది.
కేంద్ర నివేదికపై అసంతృప్తి.....
దీంతో కేంద్ర హోంశాఖ ఇవాళ కోర్టుకు నివేదిక ఆందజేసింది. ఈ నివేదిక చూసిన న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కేసును విచారణను కేంద్రమే ఎన్ఐఏకి అప్పగిస్తుందా లేదా అనేది ఈ నెల 21 నాటికి స్పష్టంగా చెప్పాలని కోర్టు కేంద్ర హోంశాఖకు ఆదేశించింది. కేసును వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది.
Next Story

