Fri Dec 05 2025 18:24:28 GMT+0000 (Coordinated Universal Time)
సోమిరెడ్డి కోరిక తీరుతుందే…!!!
రెండు రోజులుగా తన శాఖపై సమీక్ష నిర్వహించాలని భావిస్తున్న వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఎట్టకేలకు ఎన్నికల సంఘం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. [more]
రెండు రోజులుగా తన శాఖపై సమీక్ష నిర్వహించాలని భావిస్తున్న వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఎట్టకేలకు ఎన్నికల సంఘం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. [more]

రెండు రోజులుగా తన శాఖపై సమీక్ష నిర్వహించాలని భావిస్తున్న వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఎట్టకేలకు ఎన్నికల సంఘం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. రెండు రోజులుగా ఆయన సమీక్ష నిర్వహించేందుకు సచివాలయానికి వస్తున్నారు. అయితే, ఎన్నికల కోడ్ ఉన్నందున ఆయన సమీక్షలకు అధికారులు ఎవరూ హాజరుకాలేదు. కానీ, ఇప్పుడు రాష్ట్రంపై తుఫాను ప్రభావం ఉండటం, పంట నష్టం జరిగే అవకాశం ఉండటంతో తన శాఖపై సమీక్ష జరపడానికి సోమిరెడ్డికి ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఆయన రేపు సాయంత్రం తన ఛాంబర్ లో వ్యవసాయశాఖ, ఉద్యానవన శాఖపై సమీక్ష జరుపనున్నారు.
Next Story
