Thu Jan 29 2026 01:13:07 GMT+0000 (Coordinated Universal Time)
వైసీపీ గెలుపు… పండగ చేసుకుంటున్న ఉద్యోగులు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఓటమి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయం కావడంతో ఉద్యోగుల్లో హర్షాతిరేకలు వ్యక్తం అవుతున్నాయి. వైసీపీ ప్రభంజనం [more]
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఓటమి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయం కావడంతో ఉద్యోగుల్లో హర్షాతిరేకలు వ్యక్తం అవుతున్నాయి. వైసీపీ ప్రభంజనం [more]

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఓటమి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయం కావడంతో ఉద్యోగుల్లో హర్షాతిరేకలు వ్యక్తం అవుతున్నాయి. వైసీపీ ప్రభంజనం వీయడంతో ప్రభుత్వ ఉద్యోగులు బయటకు వచ్చి సంబరాలు చేసుకోవడం ఆసక్తికరంగా మారింది. ఆంధ్రప్రదేశ్ సచివాలయం బయటకు వచ్చిన ఉద్యోగులు బాణాసంచా కాల్చి, స్వీట్లు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు. ఐదేళ్లుగా తమను టీడీపీ ప్రభుత్వం ఎంతగానో ఇబ్బందులకు గురిచేసిందని, తమ సమస్యలు పరిష్కరించలేదని ఆరోపించారు. వై.ఎస్. జగన్ సమస్యలను పరిష్కరిస్తారని నమ్మకంగా ఉన్నట్లు తెలిపారు.
Next Story
