Fri Jan 30 2026 06:04:40 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : వెనక్కు తగ్గిన జగన్.. మూడు రాజధానులు వెనక్కు
మూడు రాజధానుల బిల్లులను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఈ మేరకు హైకోర్టుకు అడ్వొకేట్ జనరల్ తెలిపారు

మూడు రాజధానుల బిల్లులను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఈ మేరకు హైకోర్టుకు అడ్వొకేట్ జనరల్ తెలిపారు. మూడు రాజధానులు బిల్లులను ప్రభుత్వం వెనక్కు తీసుకున్నట్లు అడ్వొకేట్ జనరల్ తెలిపారు. హైకోర్టులో సీఆర్డీఏ రద్దు, మూడు రాజధానుల అంశంపై విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే.
మంత్రివర్గ సమావేశంలో.....
దీనిపై ఇప్పటికే మంత్రి వర్గ సమావేశం ప్రారంభమయింది. మంత్రి వర్గ సమావేశంలో ఈ బిల్లులను వెనక్కు తీసుకోనున్నారు. రాజధాని కేసుల విచారణను చేపట్టిన ధర్మాసనానికి అడ్వొకేట్ జనరల్ మూడు రాజధానుల బిల్లులను వెనక్కు తీసుకున్నట్లు తెలిపారు. మంత్రి వర్గ సమావేశం కూడా ఈ నిర్ణయం తీసుకునే అవకాశముంది.
Next Story

