Tue Mar 17 2026 12:29:05 GMT+0530 (India Standard Time)
వ్యాక్సిన్ వేయడానికి ఏపీలో కొత్త పద్ధతి
ఆంధ్రప్రదేశ్ లో కొత్త తరహాలో వ్యాక్సినేషన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వ్యాక్సినేషన్ కోసం పెద్దయెత్తున ప్రజలు తరలి రావడం, అక్కడ రద్దీ ఎక్కువగా ఉండటంతో ప్రభుత్వం దిద్దుబాటు [more]
ఆంధ్రప్రదేశ్ లో కొత్త తరహాలో వ్యాక్సినేషన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వ్యాక్సినేషన్ కోసం పెద్దయెత్తున ప్రజలు తరలి రావడం, అక్కడ రద్దీ ఎక్కువగా ఉండటంతో ప్రభుత్వం దిద్దుబాటు [more]

ఆంధ్రప్రదేశ్ లో కొత్త తరహాలో వ్యాక్సినేషన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వ్యాక్సినేషన్ కోసం పెద్దయెత్తున ప్రజలు తరలి రావడం, అక్కడ రద్దీ ఎక్కువగా ఉండటంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. వ్యాక్సినేషన్ ను ప్రస్తుతం రెండో విడత వారికే ఇస్తున్నారు. అయితే రద్దీ పెరగడంతో ఓటర్ స్లిప్ లు మాదిరిగా వారికి సమయం, తేదీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎవరికి ఏ సమయంలో వ్యాక్సిన్ వేస్తారో ఆ స్లిప్ లో పేర్కొననుంది. దీనివల్ల వ్యాక్సినేషన్ కేంద్రాల వద్ద రద్దీని నివారంచవచ్చని ప్రభుత్వం భావిస్తుంది. అందుకే ఏపీ వ్యాప్తంగా రెండు రోజుల పాటు వ్యాక్సినేషన్ ను నిలిపివేసింది.
Next Story

