Fri Dec 05 2025 12:20:48 GMT+0000 (Coordinated Universal Time)
పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్ప్రెస్
గోదావరి ఎక్స్ప్రెస్ కు పెద్ద ప్రమాదమే తప్పింది. రైలు పట్టాలు తప్పింది. అయితే ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు

గోదావరి ఎక్స్ప్రెస్ కు పెద్ద ప్రమాదమే తప్పింది. రైలు పట్టాలు తప్పింది. అయితే ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. విశాఖ నుంచి హైదరాబాద్ కు వస్తున్న గోదావరి ఎక్స్ప్రెస్ బీబీ నగర్ వద్ద పట్టాలు తప్పింి. దీంతో నిద్రలో ఉన్న ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు.
తప్పిన పెను ప్రమాదం...
ఒక్కసారిగా రైలు కుదుపులకు గురి కావడంతో ప్రయాణికులు ఏం జరిగిందో తెలియక ఆందోళన చెందారు. రైలు వేగం తక్కువగా ఉండటంతో ఎలాంటి ప్రమాదం జరగలేదని రైల్వే అధికారులు చెబుతున్నారు. దీంతో కాజీపేట - సికింద్రాబాద్ మార్గంలో రైళ్ల రాకపోకలకు ఆలస్యం ఏర్పడింది. రైళ్లన్నీ ఆలస్యంగా నడుస్తున్నాయి.పట్టాలు తప్పిన ఆరో బోగీ నుంచి వెనక ఉన్న బోగీల్లోని ప్రయాణికులను ముందు బోగీల్లోకి మార్చాల్సి వచ్చింది.
Next Story

