గంటాకు బుజ్జగింపులు....!
మరికాసేపట్లో విశాఖలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటిస్తుండటంతో మంత్రి గంటా శ్రీనివాసరావును బుజ్జగించే పనిలో పడ్డారు హోంమంత్రి చినరాజప్ప. అధిష్టానం వైఖరి, స్థానిక నేతలు తనను టార్గెట్ చేస్తున్నందుకు మనస్తాపం చెందిన ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు మూడు రోజుల నుంచి అలకబూనిన సంగతి తెలిసిందే. మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశానికి గైర్హాజరయిన గంటా మూడు రోజుల నుంచి ఇంటికే పరిమిత మయ్యారు. ఎటువంటి అధికార కార్యక్రమాలను పెట్టుకోలేదు.
ఫోన్ చేసిన చంద్రబాబు.....
అయితే ఈరోజు చంద్రబాబు పర్యటన విశాఖలో ఉండటం, అందునా గంటా శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహిస్తున్న భీమిలీ నియోజకవర్గంలో పర్యటిస్తుండటంతో గంటాను బుజ్జగించేందుకు హోంమంత్రి చినరాజప్ప ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబు కూడా గంటాతో ఫోన్ లో మాట్లాడినట్లు సమాచారం. ఎవరి మాటలను పట్టించుకోవద్దని, మీ పని మీరు చేసుకువెళ్లాలని సూచించారు. అయితే చంద్రబాబు ఎదుట గత కొద్దిరోజులుగా జరుగుతున్న పరిణామాలను ఫోన్లోనే గంటా వివరించినట్లు తెలుస్తోంది. మరి చంద్రబాబు పర్యటనలో గంటా పాల్గొంటారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది.
- Tags
- andhra pradesh
- ap politics
- bharathiya janatha pary
- china rajappa
- ganta srinivasarao
- janasena party
- nara chandrababu naidu
- narendra modi
- pavan kalyan
- telugudesam party
- y.s jaganmohanreddy
- ysr congress party
- ఆంధ్రప్రదేశ్
- ఏపీ పాలిటిక్స్
- గంటాశ్రీనివాసరావు
- చినరాజప్ప
- జనసేన పార్టీ
- తెలుగుదేశం పార్టీ
- నరేంద్ర మోదీ
- నారా చంద్రబాబు నాయుడు
- పవన్ కల్యాణ్
- భారతీయ జనతా పార్టీ
- వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ