Sat Jan 31 2026 17:03:16 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్: ఇళ్ల మధ్య కూలిన విమానం

ముంబైలో అదుపుతప్పిన ఓ ఛార్టెర్డ్ విమానం ఇళ్ల మధ్య కుప్పకూలింది. ముంబైలోని జుహూ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అవుతుండగా విమానం అదుపు తప్పి ఘట్కోపర్ ప్రాంతంలో కుప్పకూలింది. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం నుంచి 2014లో ఈ విమానాన్ని యావై ఏవియేషన్ సంస్థ కొనుగోలు చేసింది. విమాన ప్రమాదంలో మొత్తం ఐదుగురు మృతి చెందారు. మృతుల్లో ఒక పైలెట్, ముగ్గురు ప్రయాణికులు, ఒక పాదచారి ఉన్నారు. అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.
Next Story

