Wed Jan 28 2026 16:31:14 GMT+0000 (Coordinated Universal Time)
రాజధాని రైతుల పన్నెండు నెలలుగా
రాజధాని అమరావతి రైతుల నిరసనలు 360వ రోజుకు చేరుకున్నాయి. రైతులు అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని 12 నెలలుగా ఆందోళన చేస్తున్నారు. మూడు రాజధానుల ప్రతిపాదనను ప్రభుత్వం వెనక్కు [more]
రాజధాని అమరావతి రైతుల నిరసనలు 360వ రోజుకు చేరుకున్నాయి. రైతులు అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని 12 నెలలుగా ఆందోళన చేస్తున్నారు. మూడు రాజధానుల ప్రతిపాదనను ప్రభుత్వం వెనక్కు [more]

రాజధాని అమరావతి రైతుల నిరసనలు 360వ రోజుకు చేరుకున్నాయి. రైతులు అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని 12 నెలలుగా ఆందోళన చేస్తున్నారు. మూడు రాజధానుల ప్రతిపాదనను ప్రభుత్వం వెనక్కు తీసుకునేంత వరకూ తమ ఆందోళనలు కొనసాగుతాయని రైతులు చెబుతున్నారు. రాజధాని ప్రాంతాల్లోని అనేక గ్రామాల్లో రైతులు శిబిరాలను ఏర్పాటు చేసుకుని దీక్షలు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం మాత్రం రాజధాని రైతులతో ఎటువంటి చర్చలు ఇంతవరకూ జరపలేదు. ప్రస్తుతం ఈ అంశం న్యాయస్థానం పరిధిలో ఉండటంతో కోర్టు తీర్పు కోసం వేచి చూస్తున్నారు.
Next Story

