Fri May 23 2025 01:34:55 GMT+0000 (Coordinated Universal Time)
శ్రీకాకుళం: పలాస సమీపంలో ఫలక్నుమా ఎక్స్ప్రెస్కు పెనుప్రమాదం తప్పింది
శ్రీకాకుళం జిల్లాలో ఫలక్నుమా ఎక్స్ప్రెస్ కప్లింగ్ విరగడంతో రైలు విడిపోయింది. ప్రయాణికుల్లో భయాందోళనలు వెల్లివిరిశాయి.

శ్రీకాకుళం జిల్లా పలాస సమీపంలో ఈరోజు భారీ ప్రమాదం తప్పింది. సికింద్రాబాద్ నుంచి హౌరా వైపు వెళ్తున్న 12704 ఫలక్నామా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు, పలాస-మందస స్టేషన్ల మధ్య కప్లింగ్ విరిగిపోవడంతో రెండు భాగాలుగా విడిపోయింది. ఈ ఘటనలో ప్రయాణీకులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని చర్యలు చేపట్టారు. ఈ కారణంగా పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.
ప్రయాణికుల ప్రాణాలకు ఎటువంటి హాని జరగకపోవడం ఊరట కలిగించింది.
ఘటనపై పూర్తి వివరాలను రైల్వే శాఖ దర్యాప్తు చేస్తోంది.
Next Story