Sat Dec 06 2025 06:50:20 GMT+0000 (Coordinated Universal Time)
చిల్లర పనులే .. ఆ లేఖ ఫేక్
తనపై జరుగుతున్న దుష్ఫ్రచారాన్ని బీజేపీ నేత ఈటల రాజేందర్ ఖండించారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన లేఖ తనది కాదని ఈటల చెప్పారు. టీఆర్ఎస్ ఐటీ విభాగం [more]
తనపై జరుగుతున్న దుష్ఫ్రచారాన్ని బీజేపీ నేత ఈటల రాజేందర్ ఖండించారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన లేఖ తనది కాదని ఈటల చెప్పారు. టీఆర్ఎస్ ఐటీ విభాగం [more]

తనపై జరుగుతున్న దుష్ఫ్రచారాన్ని బీజేపీ నేత ఈటల రాజేందర్ ఖండించారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన లేఖ తనది కాదని ఈటల చెప్పారు. టీఆర్ఎస్ ఐటీ విభాగం చిల్లర పనులు చేస్తుందని ఈటల రాజేందర్ మండిపడ్డారు. తాను ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాయలేదని, ఆ లేఖ టీఆర్ఎస్ సృష్టి అని ఈటల రాజేందర్ తెలిపారు. తనను బద్నాం చేసేందుకు ఇలాంటి లేఖలు సృష్టిస్తున్నారన్నారు. తనను ఎదుర్కొనే దమ్ములేకనే తనపై ఇలాంటి ప్రచారం చేస్తున్నారని ఈటల రాజేందర్ తెలిపారు.
Next Story

