Wed Mar 18 2026 00:20:55 GMT+0530 (India Standard Time)
ఈటలకు చేరిక రోజే అవమానమా?
ఈటల రాజేందర్ బీజేపీలో చేరిపోయారు. ఆయన కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఆయనతో పాటు ఏనుగు రవీందర్ రెడ్డి, తుల ఉమ, రమేష్ రాథోడ్ [more]
ఈటల రాజేందర్ బీజేపీలో చేరిపోయారు. ఆయన కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఆయనతో పాటు ఏనుగు రవీందర్ రెడ్డి, తుల ఉమ, రమేష్ రాథోడ్ [more]

ఈటల రాజేందర్ బీజేపీలో చేరిపోయారు. ఆయన కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఆయనతో పాటు ఏనుగు రవీందర్ రెడ్డి, తుల ఉమ, రమేష్ రాథోడ్ తో పాటు మరికొందరు నేతలు బీజేపీలో చేరారు. అయితే తొలుత భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఈటల రాజేందర్ చేరతారని చెప్పారు. కానీ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ పార్టీ కార్యాలయంలో ఈటలను బీజేపీలోకి చేర్చుకున్నారు. చేరిక రోజునే ఈటల రాజేందర్ కు అవమానం జరిగిందన్న కామెంట్స్ వినపడుతున్నాయి. జేపీ నడ్డా సమక్షంలో చేరాలని హడావిడిగా ప్రత్యేక విమానంలో వెళ్లిన ఈటల రాజేందర్ కు జేపీీ నడ్డా సమయం కేటాయించకపోవడం చర్చనీయాంశంగా మారింది.
Next Story

