Thu Dec 18 2025 23:03:15 GMT+0000 (Coordinated Universal Time)
భట్టితో భేటీ అయిన ఈటల రాజేందర్
సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో మాజీ మంత్రి ఈటల రాజేందర్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో పరిస్థితిపై చర్చించారు. కరోనా మరణాలకు, కేసుల పెరుగుదలకు ప్రభుత్వమే కారణమని ఇరువురూ [more]
సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో మాజీ మంత్రి ఈటల రాజేందర్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో పరిస్థితిపై చర్చించారు. కరోనా మరణాలకు, కేసుల పెరుగుదలకు ప్రభుత్వమే కారణమని ఇరువురూ [more]

సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో మాజీ మంత్రి ఈటల రాజేందర్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో పరిస్థితిపై చర్చించారు. కరోనా మరణాలకు, కేసుల పెరుగుదలకు ప్రభుత్వమే కారణమని ఇరువురూ అభిప్రాయపడ్డారు. తాను ఈటల రాజేందర్ ను కాంగ్రెస్ లోకి ఆహ్వానించలేదని భట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణలో అనుకున్న లక్ష్యాలు నెరవేరడం లేదని ఈ సందర్భంగా ఈటల రాజేందర్ ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. తెలంగాణ ఆశలు, ఆకాంక్షలు నెరవేరడం లేదన్నారు. భవిష్యత్ లో ఈటల రాజేందర్ తో సంప్రదింపులు కొనసాగుతాయన్నారు.
Next Story

