Thu Jan 29 2026 02:53:35 GMT+0000 (Coordinated Universal Time)
కేసు నమోదు చేస్తాం.. ఏపీలో ఈసీ వార్నింగ్
ఎన్నికల్లో నామినేషన్లను అడ్డుకుంటే కేసులు నమోదు చేస్తామని, వాటిని తీవ్రంగా పరిగణిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ స్పష్టం చేశారు. పోటీ చేసే అభ్యర్థులను ఎవరు [more]
ఎన్నికల్లో నామినేషన్లను అడ్డుకుంటే కేసులు నమోదు చేస్తామని, వాటిని తీవ్రంగా పరిగణిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ స్పష్టం చేశారు. పోటీ చేసే అభ్యర్థులను ఎవరు [more]

ఎన్నికల్లో నామినేషన్లను అడ్డుకుంటే కేసులు నమోదు చేస్తామని, వాటిని తీవ్రంగా పరిగణిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ స్పష్టం చేశారు. పోటీ చేసే అభ్యర్థులను ఎవరు అడ్డుకున్నా సహించేది లేదన్నారు. చిత్తూరు జిల్లా సదుం మండలంలో జరిగిన ఘటనపై ఇప్పటికే కేసు నమోదు చేశామని ఆయన తెలిపారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినట్లు ఎక్కడా తమ దృష్టికి రాలేదన్నారు. ఫిర్యాదులుంటే జిల్లా ఎన్నికల పరిశీలకులు విచారించి నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. తమకు సిబ్బంది కొరత లేదని ఆయన స్పష్టం చేశారు.
Next Story

