Fri Dec 05 2025 16:07:38 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్
మహారాష్ట్రలో శాసనమండలి ఎన్నికలను నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ అంగీకరించింది. దీంతో ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేకు ఊరట లభించింది. ఈ నెల 29వ తేదీ లోగా ఉద్ధవ్ థాక్రే [more]
మహారాష్ట్రలో శాసనమండలి ఎన్నికలను నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ అంగీకరించింది. దీంతో ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేకు ఊరట లభించింది. ఈ నెల 29వ తేదీ లోగా ఉద్ధవ్ థాక్రే [more]

మహారాష్ట్రలో శాసనమండలి ఎన్నికలను నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ అంగీకరించింది. దీంతో ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేకు ఊరట లభించింది. ఈ నెల 29వ తేదీ లోగా ఉద్ధవ్ థాక్రే శాసనమండలికి ఎన్నిక కావాల్సి ఉంది. ప్రధాని మోదీతో కూడా ఉద్ధవ్ థాక్రే అదే విజ్ఞప్తి చేశారు. నిన్న గవర్నర్ ను కూడా కలసి ఎమ్మెల్సీ ఎన్నికలను నిర్వహించాలని కోరారు. దీంతో గవర్నర్ ఎన్నికల కమిషన్ కు లేఖ రాశారు. గవర్నర్ లేఖకు స్పందించిన ఎన్నికల కమిషన్ మహారాష్ట్రలో శాసనమండలి ఎన్నికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఉద్ధవ్ థాక్రే పదవి గండం నుంచి తప్పించుకున్నారు.
Next Story

