Thu May 02 2024 17:38:44 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ తో జట్టుకడుతున్నది వారే
జగన్ నేతృత్వంతో అభివృద్ధి నిరోధకులు జట్టుకడుతున్నారని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమ అన్నారు. పోలవరం ప్రాజెక్టుపై జగన్ ఆరోపణలు చేయడం సరికాదన్నరాు. పోలవరం ప్రాజెక్టు పై కేసులు వేసిన వారితో జగన్ చేతులు కలుపుతున్నారన్నారు. కేసీఆర్ కు భయపడే తెలంగాణలో జగన్ పోటీ చేయలేదన్నారు. రాష్ట్రంలో కుహనా మేధావులందరూ ఒక్కటయ్యారన్నారు. జగన్ ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి రాకుంటే మేధావులు ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. ప్రజాసమస్యలను వదిలేసి జగన్ రోడ్లపైన తిరుగుతున్నారన్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా ఏపీలో అభివృద్ధిని ఎవరూ అడ్డుకోలేరన్నారు దేవినేని ఉమ.
Next Story