Wed May 01 2024 03:08:09 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : విశాఖలో 12కు చేరిన మృతుల సంఖ్య.. నేటి నుంచి సర్వే
విశాఖపట్నం గ్యాస్ లీక్ ఘటనలో మృతుల సంఖ్య 12కు చేరుకుంది. ప్రస్తుతం ఎల్జీ పాలిమర్స్ లో గ్యాస్ లీక్ అదుపులోకి వచ్చిందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇంకా [more]
విశాఖపట్నం గ్యాస్ లీక్ ఘటనలో మృతుల సంఖ్య 12కు చేరుకుంది. ప్రస్తుతం ఎల్జీ పాలిమర్స్ లో గ్యాస్ లీక్ అదుపులోకి వచ్చిందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇంకా [more]
విశాఖపట్నం గ్యాస్ లీక్ ఘటనలో మృతుల సంఖ్య 12కు చేరుకుంది. ప్రస్తుతం ఎల్జీ పాలిమర్స్ లో గ్యాస్ లీక్ అదుపులోకి వచ్చిందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇంకా విషవాయువులు ప్రభావం పరిసర ప్రాంతాల్లో ఉండటంతో గ్రామాల్లోకి ఎవరూ రావద్దని ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది. నేడు గ్యాస్ లీక్ ఘటనపై విచారణ జరగనుంది. దీంతో పాటు పరిసర ప్రాంత గ్రామాల్లో ఇంటింటి సర్వే నిర్వహించనున్నారు. గ్యాస్ లీక్ బాధితులను గుర్తించనున్నారు. గ్యాస్ లీక్ కారణంగా అస్వస్థతకు గురై 348 మంది చికిత్స పొందుతున్నారు.
Next Story