Mon Feb 02 2026 08:03:37 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో అక్కడ 24 గంటల కర్ఫ్యూ
తూర్పు గోదావరి జిల్లాలో నేడు కర్ఫ్యూ అమలు చేశారు. కరోనా పాజిటివ్ కేసుల పెరుగుతున్న కారణంగా జిల్లా అంతటా ఒకరోజు కర్ఫ్యూ విధిస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. నేటి [more]
తూర్పు గోదావరి జిల్లాలో నేడు కర్ఫ్యూ అమలు చేశారు. కరోనా పాజిటివ్ కేసుల పెరుగుతున్న కారణంగా జిల్లా అంతటా ఒకరోజు కర్ఫ్యూ విధిస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. నేటి [more]

తూర్పు గోదావరి జిల్లాలో నేడు కర్ఫ్యూ అమలు చేశారు. కరోనా పాజిటివ్ కేసుల పెరుగుతున్న కారణంగా జిల్లా అంతటా ఒకరోజు కర్ఫ్యూ విధిస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. నేటి ఉదయం ఆరు గంటల నుంచి రేపు ఉదయం 6గంటల వరకూ కర్ఫ్యూ జిల్లా అంతటా కొనసాగనుంది. అత్యవసర సేవలకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటి వరకూ తూర్పు గోదావరి జిల్లాలో 5,564 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులోనే 1,051 కేసులు నమోదవ్వడంతో కలెక్టర్ కర్ఫ్యూ విధించాలని నిర్ణయించారు.
Next Story

