Sun Mar 15 2026 09:23:14 GMT+0530 (India Standard Time)
లాక డౌన్ కఠినతరం చేసినా లాభం లేదే?
గుంటూరు జిల్లాలో కరోనా వైరస్ రోజురోజుకూ పెరుగుతోంది. తొలి కేసు నమోదయిన వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. లాక్ డౌన్ ను కఠినం చేశారు. అయినా కరోనా పాజిటివ్ [more]
గుంటూరు జిల్లాలో కరోనా వైరస్ రోజురోజుకూ పెరుగుతోంది. తొలి కేసు నమోదయిన వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. లాక్ డౌన్ ను కఠినం చేశారు. అయినా కరోనా పాజిటివ్ [more]

గుంటూరు జిల్లాలో కరోనా వైరస్ రోజురోజుకూ పెరుగుతోంది. తొలి కేసు నమోదయిన వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. లాక్ డౌన్ ను కఠినం చేశారు. అయినా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకూ గుంటూరు జిల్లాలో 237 మందికి కరోనా వైరస్ సోకింది. రాష్ట్రంలోనే రెండో స్థానంలో గుంటూరు నిలిచింది. ఇక మరణాల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ఎనిమిది మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో లాక్ డౌన్ వేళలను కుదించి మరీ అధికారుల కఠినతరం చేశారు. రెడ్ జోన్లు, కంటెయిన్ మెంట్ల జోన్ల వద్ద విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు.
Next Story

