Mon May 06 2024 20:47:40 GMT+0000 (Coordinated Universal Time)
మళ్లీ శ్రీవారి దర్శనాల నిలిపివేత? కేసులు పెరుగుతుండటంతో
తిరుమలలో కరోనా పాజటివ్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో స్వామి వారి దర్శనాలను నిలిపివేయాలన్న ఆలోచనలో టీటీడీ ఉన్నట్లు తెలుస్తోంది. మరికాసేపట్లో దీనిపై ప్రకటన విడుదలయ్యే అవకాశముంది. తిరుమలలో [more]
తిరుమలలో కరోనా పాజటివ్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో స్వామి వారి దర్శనాలను నిలిపివేయాలన్న ఆలోచనలో టీటీడీ ఉన్నట్లు తెలుస్తోంది. మరికాసేపట్లో దీనిపై ప్రకటన విడుదలయ్యే అవకాశముంది. తిరుమలలో [more]
తిరుమలలో కరోనా పాజటివ్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో స్వామి వారి దర్శనాలను నిలిపివేయాలన్న ఆలోచనలో టీటీడీ ఉన్నట్లు తెలుస్తోంది. మరికాసేపట్లో దీనిపై ప్రకటన విడుదలయ్యే అవకాశముంది. తిరుమలలో 18 మంది అర్చకులకు కరోనా సోకింది. వీరికి మెరుగైన వైద్యం అందించేందుకు చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. దర్శానాల ప్రారంభం తర్వాతనే కేసుల సంఖ్య పెరుగుతోందని టీటీడీ ఉద్యోగులు, స్థానికులు అభిప్రాయపడుతున్నారు. దీంతో తాత్కాలికంగా తిరుమలలో దర్శనాలు నిలిపివేయాలని నిర్ణయం తీసుకునే అవకాశముంది.
Next Story