Tue Dec 16 2025 00:47:37 GMT+0000 (Coordinated Universal Time)
అన్నదానం చేసిన వ్యక్తికి పాజిటివ్… ఆందోళనలో?
హైదరాబాద్ లోని నేరేడ్ మెట్ లోని మధురానగర్ లో ఒక వ్యక్తి కరోనా పాజిటివ్ కేసు నమోదయింది. అయితే ఆ వ్యక్తి రెండు రోజుల క్రితం పేదలకు [more]
హైదరాబాద్ లోని నేరేడ్ మెట్ లోని మధురానగర్ లో ఒక వ్యక్తి కరోనా పాజిటివ్ కేసు నమోదయింది. అయితే ఆ వ్యక్తి రెండు రోజుల క్రితం పేదలకు [more]

హైదరాబాద్ లోని నేరేడ్ మెట్ లోని మధురానగర్ లో ఒక వ్యక్తి కరోనా పాజిటివ్ కేసు నమోదయింది. అయితే ఆ వ్యక్తి రెండు రోజుల క్రితం పేదలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. అన్నదానం కూడా చేశారు. ఈ కార్యక్రమానికి నేరేడ్ మెట్ పోలీసులు కూడా హాజరయ్యారని తెలుస్తోంది. దీంతో అన్నదానానికి, నిత్యావసర వస్తువుల పంపిణీకి హాజరయిన వారందరికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. దాదాపు వంద మందికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. కుటుంబ సభ్యులను ఇప్పటికే క్వారంటైన్ కు తరలించారు.
Next Story

