Fri Dec 05 2025 21:35:21 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీ సెక్రటేరియట్ లో కరోనా కలకలం… నలుగురి మృతి
ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో కరోనా కలకలం రేపుతోంది. వరసగా ఉద్యోగులు కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటివరకూ గత వారం రోజుల నుంచి నలుగురు ఉద్యోగులు మరణించారు. దీంతో సెక్రటేరియట్ [more]
ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో కరోనా కలకలం రేపుతోంది. వరసగా ఉద్యోగులు కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటివరకూ గత వారం రోజుల నుంచి నలుగురు ఉద్యోగులు మరణించారు. దీంతో సెక్రటేరియట్ [more]

ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో కరోనా కలకలం రేపుతోంది. వరసగా ఉద్యోగులు కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటివరకూ గత వారం రోజుల నుంచి నలుగురు ఉద్యోగులు మరణించారు. దీంతో సెక్రటేరియట్ ఉద్యోగులు తమకు వర్క్ ఫ్రం హోం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సెకండ్ వేవ్ ఉధృతంగా ఉండటంతో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా తమ ఉద్యోగులు కరోనా బారిన పడుతున్నారని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిన్న పంచాయతీరాజ్ శాఖలో పనిచేస్తున్న శాంతకుమారి కరోనాతో మరణించారు. సచివాలయంలో పనిచేస్తున్న ఆమె భర్త కూడా రెండు రోజుల క్రితం కరోనాతో మరణించారు.
Next Story

