Fri Dec 05 2025 20:16:23 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీ ప్రభుత్వంపై హోంశాఖకు ఫిర్యాదు చేసిన సీఎం రమేష్
బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఏపీ ప్రభుత్వ తీరుపై హోం శాఖకు ఫిర్యాదు చేశారు. ఏపీలో జరుగుతున్న అక్రమ అరెస్ట్ లను ఆయన అమిత్ షా [more]
బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఏపీ ప్రభుత్వ తీరుపై హోం శాఖకు ఫిర్యాదు చేశారు. ఏపీలో జరుగుతున్న అక్రమ అరెస్ట్ లను ఆయన అమిత్ షా [more]

బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఏపీ ప్రభుత్వ తీరుపై హోం శాఖకు ఫిర్యాదు చేశారు. ఏపీలో జరుగుతున్న అక్రమ అరెస్ట్ లను ఆయన అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. గతంలో తిరుపతి బస్సులో అన్యమత ప్రచారం జరిగిన విషయాన్ని ఈ సందర్భంగా సీఎం రమేష్ గుర్తు చేశారు. ఎవరో మెసేజ్ ఫార్వార్డ్ చేశారని ఎవరినో ఈ కేసులో అరెస్ట్ చేసిి మసిబూసి మారేడుకాయ చేశారన్నారు. ప్రశ్నించిన వారందరినీ అరెస్ట్ లు చేస్తున్నారని సీఎం రమేష్ అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. ఏపీ ప్రభుత్వం తీరు విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని సీఎం రమేష్ విజ్ఞప్తి చేశారు.
Next Story

