Sat Mar 07 2026 10:11:31 GMT+0530 (India Standard Time)
పవన్ కు సహకరిస్తాం
ఇసుక కొరతపై ఆందోళనకు దిగుతున్న పవన్ కల్యాణ్ కు సహకరిస్తామని, మద్దతిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తెలిపారు. విశాఖలో జరుగుతున్న లాంగ్ మార్చ్ కు తమ పార్టీ [more]
ఇసుక కొరతపై ఆందోళనకు దిగుతున్న పవన్ కల్యాణ్ కు సహకరిస్తామని, మద్దతిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తెలిపారు. విశాఖలో జరుగుతున్న లాంగ్ మార్చ్ కు తమ పార్టీ [more]

ఇసుక కొరతపై ఆందోళనకు దిగుతున్న పవన్ కల్యాణ్ కు సహకరిస్తామని, మద్దతిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తెలిపారు. విశాఖలో జరుగుతున్న లాంగ్ మార్చ్ కు తమ పార్టీ తరుపున సీనియర్ నేతలను పంపుతున్నామన్నారు. ప్రజాసమస్యలపై ఎవరు పోరాడినా తమ పార్టీ మద్దతు తెలుపుతుందన్నారు. రాష్ట్రంలో ఉన్న 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకు అండగా ఉంటామని చెప్పారు. ఇసుక కొరత సమస్య పరిష్కారమయ్యే వరకూ తమ పోరాటం ఆగదని చంద్రబాబు తెలిపారు. చనిపోయిన భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకు చంద్రబాబు పార్టీ తరుపున లక్ష రూపాయల విరాళాన్ని అందజేశారు.
Next Story

