Sun Dec 21 2025 01:40:48 GMT+0000 (Coordinated Universal Time)
మరో మూడు వారాలు బాబుకు ఊరట
రాజధాని అసైన్డ్ భూ కుంభకోణం కేసులో సీఐడీ విచారణపై మరో మూడు వారాల పాటు స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు జారీ చేసింది. అసైన్డ్ భూముల [more]
రాజధాని అసైన్డ్ భూ కుంభకోణం కేసులో సీఐడీ విచారణపై మరో మూడు వారాల పాటు స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు జారీ చేసింది. అసైన్డ్ భూముల [more]

రాజధాని అసైన్డ్ భూ కుంభకోణం కేసులో సీఐడీ విచారణపై మరో మూడు వారాల పాటు స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు జారీ చేసింది. అసైన్డ్ భూముల కేసుల్లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణలకు సీఐడీ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై సీఐడీ వివరణ ఇవ్వాలని హైకోర్టు కోరింది. మరో మూడు వారాల పాటు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు సూచించింది. దీనికి కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.
Next Story

