Thu Jan 15 2026 05:05:54 GMT+0000 (Coordinated Universal Time)
ప్రజల ప్రాణాలతో చెలగాటమా? చంద్రబాబు సూటి ప్రశ్న
మడ అడవులను నరకడంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలతో వైసీపీ ప్రభుత్వం ఆడుకుంటుందని చంద్రబాబు ట్వీట్ చేశారు. “ఐక్యరాజ్య సమితి [more]
మడ అడవులను నరకడంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలతో వైసీపీ ప్రభుత్వం ఆడుకుంటుందని చంద్రబాబు ట్వీట్ చేశారు. “ఐక్యరాజ్య సమితి [more]

మడ అడవులను నరకడంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలతో వైసీపీ ప్రభుత్వం ఆడుకుంటుందని చంద్రబాబు ట్వీట్ చేశారు. “ఐక్యరాజ్య సమితి సైతం గుర్తించిన కోరింగ మడ అడవులను వైసీపీ ప్రభుత్వం ఎలా నరికేసి, మట్టి నింపేస్తుందో చూడండి. కాకినాడకు రక్షణ కవచం లాంటి మడ అడవులను ఇలా నరికేస్తే రేపు తుఫానులొచ్చినప్పుడు ప్రజల సంగతి ఏంటి? ఇలాంటి చోట ఇళ్ళు కట్టుకుంటే ఆ పేదలకు రక్షణ ఏంటి?” అని చంద్రబాబు ప్రశ్నించారు. చంద్రబాబు మడ అడవులకు సంబంధించిన ఫొటోలను ట్విట్టర్ లో పోస్టు చేశారు.
Next Story

