Tue Mar 17 2026 00:02:18 GMT+0530 (India Standard Time)
వాలంటీర్లను ఎందుకు వాడటం లేదు?
టీడీపీ అధినేత చంద్రబాబు వాలంటీర్ల వ్యవస్థను దుర్వినియోగం చేయడంపై మండిపడ్డారు. వాలంటీర్లను వినియోగించకుండా వైసీపీ నేతలను ఎందుకు వెయ్యి రూపాయల నగదు పంపిణీకి వినియోగిస్తున్నారని ప్రశ్నించారు. కరోనా [more]
టీడీపీ అధినేత చంద్రబాబు వాలంటీర్ల వ్యవస్థను దుర్వినియోగం చేయడంపై మండిపడ్డారు. వాలంటీర్లను వినియోగించకుండా వైసీపీ నేతలను ఎందుకు వెయ్యి రూపాయల నగదు పంపిణీకి వినియోగిస్తున్నారని ప్రశ్నించారు. కరోనా [more]

టీడీపీ అధినేత చంద్రబాబు వాలంటీర్ల వ్యవస్థను దుర్వినియోగం చేయడంపై మండిపడ్డారు. వాలంటీర్లను వినియోగించకుండా వైసీపీ నేతలను ఎందుకు వెయ్యి రూపాయల నగదు పంపిణీకి వినియోగిస్తున్నారని ప్రశ్నించారు. కరోనా సాయం కింద ఇచ్చే వెయ్యి రూపాయలను వైసీపీ నేతలు పంచుతున్నారని, దీనికి అభ్యంతరం తెలిపిన వాలంటీర్లను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నారని చంద్రబాబు ఫైర్ అయ్యారు. అసలు వాలంటీర్ల వ్యవస్థ ఎందుకు ఉన్నట్లు అని చంద్రబాబు నిలదీశారు. విధుల నుంచి తొలగించినందుకు విజయనగరం జిల్లాలో ఒక వాలంటీర్ ఆత్మహత్యకు పాల్పడిన విషయాన్ని చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తు చేశారు.
Next Story

