Sat Jan 17 2026 05:52:46 GMT+0000 (Coordinated Universal Time)
రాజధాని రైతులకు అండగా
రాజధాని రైతులకు టీడీపీ అధినేత చంద్రబాబు సంఘీభావం తెలిపారు. చంద్రబాబు తుళ్లూరులో ఆందోళన చేస్తున్న రైతులకు అండగా నిలచారు. తన మీద వ్యక్తిగత కక్షతోనే అమరావతిని చంపేస్తున్నారని [more]
రాజధాని రైతులకు టీడీపీ అధినేత చంద్రబాబు సంఘీభావం తెలిపారు. చంద్రబాబు తుళ్లూరులో ఆందోళన చేస్తున్న రైతులకు అండగా నిలచారు. తన మీద వ్యక్తిగత కక్షతోనే అమరావతిని చంపేస్తున్నారని [more]

రాజధాని రైతులకు టీడీపీ అధినేత చంద్రబాబు సంఘీభావం తెలిపారు. చంద్రబాబు తుళ్లూరులో ఆందోళన చేస్తున్న రైతులకు అండగా నిలచారు. తన మీద వ్యక్తిగత కక్షతోనే అమరావతిని చంపేస్తున్నారని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అన్ని హంగులు ఉన్న అమరావతిని కాదంటున్నారంటే ఇందులో కక్ష తప్ప మరేదేమీ లేదన్నారు. భూముల కొనుగోళ్లలో అవకతవకలు జరిగితే చర్యలు తీసుకోవాలే కాని ఇలా అమరావతిని చంపేయడమేంటని ప్రశ్నించారు. మూడు రాజధానులను తాను ఎక్కడా చూడలేదని, రాజ్యంగంలోనూ చదవలేదని చంద్రబాబు చెప్పుకొచ్చారు. తాను రాజధాని అమరావతి రైతులకు అండగా ఉంటానని తెలిపారు.
Next Story

