Sat Jan 31 2026 16:22:15 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ కు దోచుకోవడమే పని
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దోపిడీ చేయడమే పనిగా పెట్టుకున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఆరు నెలల పాలనలో సీఎం జగన్ అభివృద్ధిని పూర్తిగా పక్కన [more]
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దోపిడీ చేయడమే పనిగా పెట్టుకున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఆరు నెలల పాలనలో సీఎం జగన్ అభివృద్ధిని పూర్తిగా పక్కన [more]

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దోపిడీ చేయడమే పనిగా పెట్టుకున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఆరు నెలల పాలనలో సీఎం జగన్ అభివృద్ధిని పూర్తిగా పక్కన పెట్టారన్నారు. ఇది భవిష్యత్తులో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా మారనుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. వైసీపీ నేతలు ఇష్టారీతిన కండకావరంతో వ్యవహరిస్తున్నారన్నారు. టీడీపీ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ కు వెళ్లి కేసులు పెట్టాలన్నా భయపడే పరిస్థితి వచ్చిందన్నారు. పైగా రివర్స్ లో టీడీపీ కార్యకర్తలపై కేసులు పెడుతున్నారన్నారు. ఇందుకు వైసీపీ భారీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. కర్నూలులో చంద్రబాబు మీడియాతో మాట్లాడారు.
Next Story

