Thu Mar 19 2026 19:57:28 GMT+0530 (India Standard Time)
వంశీ ప్లేస్ ను ఆయనకు అప్పగించాలి
టీడీపీకి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామా చేశారు. దీంతో అక్కడ తర్వాత నాయకత్వం ఎవరు చేపడతారన్న చర్చ మొదలయింది. ఈరోజు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు గన్నవరం [more]
టీడీపీకి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామా చేశారు. దీంతో అక్కడ తర్వాత నాయకత్వం ఎవరు చేపడతారన్న చర్చ మొదలయింది. ఈరోజు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు గన్నవరం [more]

టీడీపీకి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామా చేశారు. దీంతో అక్కడ తర్వాత నాయకత్వం ఎవరు చేపడతారన్న చర్చ మొదలయింది. ఈరోజు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గ సమీక్షను నిర్వహించారు. ఈ సమీక్షకు వల్లభనేని వంశీ రాలేదు. అయినా గన్నవరం నుంచి టీడీపీ కార్యకర్తలు హాజరయ్యారు. వారంతా దేవినేని అవినాష్ కు గన్నవరం బాధ్యతలను అప్పగించాలని డిమాండ్ చేశారు. అయితే చంద్రబాబు దీనిపై ఎలాంటి నిర్ణయం చెప్పకుండా, తర్వాత చూద్దామని సమీక్షను ముగించారు.
Next Story

