Sat Dec 06 2025 04:08:07 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : దీక్షకు ముందు చంద్రబాబు చేసిన పని ఇదే
రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని చంద్రబాబు నాయుడు మరోసారి కేంద్రానికి లేఖలు రాశారు. రాష్ట్రపతి, ప్రధాని, హోంమంత్రికి లేఖలు రాశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పాయని, ప్రతిపక్ష [more]
రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని చంద్రబాబు నాయుడు మరోసారి కేంద్రానికి లేఖలు రాశారు. రాష్ట్రపతి, ప్రధాని, హోంమంత్రికి లేఖలు రాశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పాయని, ప్రతిపక్ష [more]

రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని చంద్రబాబు నాయుడు మరోసారి కేంద్రానికి లేఖలు రాశారు. రాష్ట్రపతి, ప్రధాని, హోంమంత్రికి లేఖలు రాశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పాయని, ప్రతిపక్ష పార్టీ కార్యాలయాలపై దాడులు జరుగుతున్నాయని చంద్రబాబు వారికి రాసిన లేఖలో పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీ నేతలకే రక్షణ లేకుండా పోయిందని చంద్రబాబు అన్నారు. దాడులకు సంబంధించిన వీడియోలు, ఫొటోలను కూడా లేఖలకు జత చేశారు. వెంటనే రాష్ట్రపతి పాలనను ఏపీలో పెట్టాలని చంద్రబాబు కోరారు. దీక్ష చేయడానికి ముందు చంద్రబాబు రాష్ట్రంలో పరిస్థితిని కేంద్రంలో ఉన్న పెద్దలకు వివరించారు.
Next Story

