చంద్రబాబు అమరావతి పర్యటనపై హైకోర్టుకు?
టీడీపీ అధినేత చంద్రబాబు లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించారంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలయింది. మాజీ ఎమ్మెల్సీ వేణుగోపాల్ రెడ్డి ఈ పిటీషన్ దాఖలు చేశారు. పోలీసులు కూడా [more]
టీడీపీ అధినేత చంద్రబాబు లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించారంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలయింది. మాజీ ఎమ్మెల్సీ వేణుగోపాల్ రెడ్డి ఈ పిటీషన్ దాఖలు చేశారు. పోలీసులు కూడా [more]
టీడీపీ అధినేత చంద్రబాబు లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించారంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలయింది. మాజీ ఎమ్మెల్సీ వేణుగోపాల్ రెడ్డి ఈ పిటీషన్ దాఖలు చేశారు. పోలీసులు కూడా చంద్రబాబు పర్యటనలో లాక్ డౌన్ నిబంధనలను పట్టించుకోలేదని ఆయన చీఫ్ జస్టిస్ కు నేరుగా ఫిర్యాదు చేశారు. రెండు నెలల తర్వాత నిన్న చంద్రబాబు అమరావతికి చేరుకున్నారు. మార్గమధ్యంలో చంద్రబాబుకు టీడీపీ కార్యకర్తలు భారీగా స్వాగతం పలికారు. అయితే కార్యకర్తలు ఎవరూ మాస్క్ లు ధరించకుండా చంద్రబాబు పర్యటనలో పాల్గొన్నారని పిటీషనర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏపీలో ఎంటర్ అయిన దగ్గర నుంచి చంద్రబాబు అనేక చోట్ల లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించారంటూ ఆయన చీఫ్ జస్టిస్ కు చేసిన ఫిర్యాదులో తెలిపారు.