Fri Jan 30 2026 03:26:43 GMT+0000 (Coordinated Universal Time)
ఆ హత్యల వెనక వైసీపీ ఎమ్మెల్యే కాటసాని
తెలుగుదేశం పార్టీ నేతల హత్యలపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. కర్నూలు జిల్లాలో ఇద్దరు టీడీపీ నేతల హత్యలను ఆయన ఖండించారు. ఈ హత్యల [more]
తెలుగుదేశం పార్టీ నేతల హత్యలపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. కర్నూలు జిల్లాలో ఇద్దరు టీడీపీ నేతల హత్యలను ఆయన ఖండించారు. ఈ హత్యల [more]

తెలుగుదేశం పార్టీ నేతల హత్యలపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. కర్నూలు జిల్లాలో ఇద్దరు టీడీపీ నేతల హత్యలను ఆయన ఖండించారు. ఈ హత్యల వెనక కాటసాని రాంభూపాల్ రెడ్డి హస్తం ఉందని చంద్రబాబు ఆరోపించారు. కర్నూలు జిల్లాలో టీడీపీ నాయకులు నాగేశ్వర్ రెడ్డి, ప్రతాపరెడ్డిలను దారుణంగా హత్య చేశారన్నారు. పట్టపగలే దారుణంగా హత్య చేసినా పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని చంద్రబాబు ఆరోపించారు. పోలీసులు కూడా వైసీపీ నేతల తొత్తులుగా మారారని చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు.
Next Story

