Thu Dec 18 2025 17:57:17 GMT+0000 (Coordinated Universal Time)
నిమ్మగడ్డ పై చంద్రబాబు గరం…గరం
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై మండిపడ్డారు. పంచాయతీ ఎన్నికలను సక్రమంగా నిర్వహించడంలో ఎన్నికల కమిషన్ విఫలమయిందని చంద్రబాబు [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై మండిపడ్డారు. పంచాయతీ ఎన్నికలను సక్రమంగా నిర్వహించడంలో ఎన్నికల కమిషన్ విఫలమయిందని చంద్రబాబు [more]

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై మండిపడ్డారు. పంచాయతీ ఎన్నికలను సక్రమంగా నిర్వహించడంలో ఎన్నికల కమిషన్ విఫలమయిందని చంద్రబాబు అన్నారు. ఎన్నికల కమిషన్ తన అధికారాలను పూర్తిగా వినియోగించలేదని చంద్రబాబు అన్నారు. ఎన్నికల్లో పోటీ చేసిన టీడీపీ వారిపైనే కేసులు పెడుతున్నారన్నారు. ఎన్ని మార్లు ఎస్ఈసీకి ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని చంద్రబాబు అన్నరాు. దీనిపై రాష్ట్రపతి, కేంద్ర హోంమంత్రికి ఫిర్యాదు చేయనున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకూ ఎన్నికల కమిషనర్ బాధ్యత వహించాలని చంద్రబాబు తెలిపారు.
Next Story

