Sat Mar 28 2026 06:34:49 GMT+0530 (India Standard Time)
వైసీపీ చీకటి అజెండా అదే
దేవాలయాలపై జరుగుతున్న దాడుల వెనక వైసీపీ చీకటి ఎజెండా ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. మతమార్పిడుల కోసమే ఆలయాలపై దాడులను ప్రోత్సహిస్తున్నారన్నారు. తమ ఓటు బ్యాంకును [more]
దేవాలయాలపై జరుగుతున్న దాడుల వెనక వైసీపీ చీకటి ఎజెండా ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. మతమార్పిడుల కోసమే ఆలయాలపై దాడులను ప్రోత్సహిస్తున్నారన్నారు. తమ ఓటు బ్యాంకును [more]

దేవాలయాలపై జరుగుతున్న దాడుల వెనక వైసీపీ చీకటి ఎజెండా ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. మతమార్పిడుల కోసమే ఆలయాలపై దాడులను ప్రోత్సహిస్తున్నారన్నారు. తమ ఓటు బ్యాంకును పెంచుకునే ప్రయత్నంలో భాగంగానే వరసగా ఆంధ్రప్రదేశ్ లో ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని చంద్రబాబు అన్నారు. సంప్రదాయాలను పక్కనపెట్టడం భక్తుల మనోభావాలను గాయపర్చడమేనని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. మంత్రుల వ్యాఖ్యలు కూడా దీనికి అద్దం పడుతున్నాయన్నారు. వైసీపీ అరాచక ప్రభుత్వాన్ని తరిమికొట్టాలని చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా పార్లమెంట్ నియోజకవర్గ నేతలకు చంద్రబాబు పిలుపునిచ్చారు.
Next Story

