Thu Jan 29 2026 08:53:16 GMT+0000 (Coordinated Universal Time)
వైసీపీ నేతలు దోచేస్తున్నారు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. ప్రజాసమస్యలపై దృష్టిపెట్టకుండా తెలుగుదేశం పార్టీపై కక్ష సాధింపు చర్యలను పనిగా వైసీపీ పెట్టుకుందన్నారు చంద్రబాబునాయుడు. ఆయన [more]
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. ప్రజాసమస్యలపై దృష్టిపెట్టకుండా తెలుగుదేశం పార్టీపై కక్ష సాధింపు చర్యలను పనిగా వైసీపీ పెట్టుకుందన్నారు చంద్రబాబునాయుడు. ఆయన [more]

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. ప్రజాసమస్యలపై దృష్టిపెట్టకుండా తెలుగుదేశం పార్టీపై కక్ష సాధింపు చర్యలను పనిగా వైసీపీ పెట్టుకుందన్నారు చంద్రబాబునాయుడు. ఆయన ఈరోజు ఉదయం పార్టీ వ్యూహకర్తలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇసుక అక్రమ రవాణాలో వైసీపీ నేతలు ఆరితేరారన్నారు. ఎంపీ, ఎమ్మెల్యేల వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకునేంత వరకూ పరిస్థితి వచ్చిందన్నారు చంద్రబాబునాయుడు. అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాలను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారన్నారు.
Next Story

