Sun May 05 2024 04:20:22 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : మంత్రులతో చంద్రబాబు సమాలోచనలు
అమరావతిలో అందుబాటులో ఉన్న మంత్రులతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అత్యవసరంగా భేటీ అయ్యారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు, రాష్ట్రంలో ఐటీ దాడులపై సమాలోచనలు జరుపుతున్నారు. ఐటీ దాడుల వెనుక ఏదైనా రాజకీయ కుట్ర జరుగుతుందా అని టీడీపీ అనుమానం వ్యక్తం చేస్తోంది. ఇక కేసీఆర్ వ్యాఖ్యలను ఎలా తిప్పికొట్టాలనే అంశంపై చంద్రబాబు నేతృత్వంలో చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇవాళ సాయంత్రం మంత్రివర్గ సమావేశం జరగాల్సి ఉండగా... అధికారుల ముందు రాజకీయ అంశాలను పూర్తిస్థాయిలో మాట్లాడే అవకాశం లేకపోవడంతో మంత్రివర్గ సమావేశానికి ముందే ప్రత్యేకంగా ఈ భేటీ జరుగుతోంది.
Next Story