Sat Dec 06 2025 16:24:16 GMT+0000 (Coordinated Universal Time)
ఆయన జూమ్ కి.. ఈయన ట్విట్టర్ కే పరిమితం
టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీలో ప్రతిపక్షం ఉన్నట్లు భ్రమ కల్పిస్తున్నారని వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు జూమ్ కే పరిమితమయ్యారన్నారు. ఏపీలో ప్రతిపక్షాన్ని ప్రజలు [more]
టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీలో ప్రతిపక్షం ఉన్నట్లు భ్రమ కల్పిస్తున్నారని వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు జూమ్ కే పరిమితమయ్యారన్నారు. ఏపీలో ప్రతిపక్షాన్ని ప్రజలు [more]

టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీలో ప్రతిపక్షం ఉన్నట్లు భ్రమ కల్పిస్తున్నారని వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు జూమ్ కే పరిమితమయ్యారన్నారు. ఏపీలో ప్రతిపక్షాన్ని ప్రజలు ఎప్పుడో దూరంగా పెట్టారన్నారు. దళితులపై దాడులు జరిగితే తమ ప్రభుత్వం తాట తీస్తుందని హెచ్చరించారు. ఎవరినీ వదలిపెట్టబోమని హెచ్చరించారు. ఇక చినబాబు లోకేష్ ట్విట్టర్ కే పరిమితమయ్యారన్నారు. ప్రజలను తప్పు దోవ పట్టించే విధంగా ప్రకటనలు మానుకుని ఇకనైనా నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించాలని అంబటి రాంబాబు కోరారు.
Next Story

