Wed Jul 09 2025 03:51:30 GMT+0000 (Coordinated Universal Time)
ఆ రెడ్డిల స్ఫూర్తితో పోరాడుదాం

కేంద్రం మాట నిలబెట్టుకోకుండా తెలుగువారి దెబ్బ చూపిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. కర్నూలులో జరిగిన ధర్మ పోరాట సభలో ఆయన మాట్లాడుతూ... నరేంద్ర మోదీ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తామని ఆయన పేర్కొన్నారు. బ్రిటీష్ వారిపై ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, కొండారెడ్డి పోరాడినట్లే, వారి స్ఫూర్తితోనే బీజేపీపై పోరాడుతామని పునరుద్ఘాటించారు. హేతుబద్ధత లేని విభజన చేసి రాష్ట్రానికి అన్యాయం చేశారని, ఈ విభజనకు వ్యతిరేకంగా ఢిల్లీలో దీక్ష చేశానని ఆయన గుర్తు చేశారు. కేంద్రానికి ఎంతచెప్పినా పట్టించుకోవడం లేదని, పార్లమెంట్ లో టీడీపీ ఎంపీలు బొబ్బిలిపులుల్లా పోరాడారని పేర్కొన్నారు. వైసీపీ ఉచ్చులో ప్రధాని మోదీనే పడ్డారని, త్వరలోనే దీనికి ఫలితం అనుభవిస్తారని హెచ్చరించారు.
Next Story