Wed Jan 28 2026 23:49:52 GMT+0000 (Coordinated Universal Time)
వివేకా హత్య కేసులో కీలక నేతలను?
వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ రాజకీయ ప్రముఖులను ప్రశ్నించనుంది. వివేకా హత్య కేసులో ఆయన కుటుంబం పలువురిపై అనుమానాలను వ్యక్తం చేసింది. సీబీఐ విచారణ కడపలో [more]
వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ రాజకీయ ప్రముఖులను ప్రశ్నించనుంది. వివేకా హత్య కేసులో ఆయన కుటుంబం పలువురిపై అనుమానాలను వ్యక్తం చేసింది. సీబీఐ విచారణ కడపలో [more]

వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ రాజకీయ ప్రముఖులను ప్రశ్నించనుంది. వివేకా హత్య కేసులో ఆయన కుటుంబం పలువురిపై అనుమానాలను వ్యక్తం చేసింది. సీబీఐ విచారణ కడపలో నిర్వహిస్తున్నారు. తొలుత వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు విచారించనున్నారు. ఆయనతో పాటు వైఎస్ వివేకా సోదరులను కూడా విచారించనున్నట్లు తెలిసింది. అనంతరం బీజేపీ నేత ఆదినారాయణరెడ్డి, టీడీపీ నేత బీటెక్ రవిలను కూడా సీబీఐ విచారించనుంది. సీబీఐ ఇప్పటికే వైఎస్ వివేకా కుమార్తె సునీతను విచారించింది.
Next Story

