మాజీ మంత్రి పై హైకోర్టు లో పిల్
మాజీ మంత్రి, ప్రస్తుత శాసన సభ్యుడు రెడ్యా నాయక్ పై హై కోర్టు లో పిల్ దాఖలైంది. తన ఇంటిముందు ఉన్న స్కూల్ ని కూల్చివేసి పార్కింగ్ [more]
మాజీ మంత్రి, ప్రస్తుత శాసన సభ్యుడు రెడ్యా నాయక్ పై హై కోర్టు లో పిల్ దాఖలైంది. తన ఇంటిముందు ఉన్న స్కూల్ ని కూల్చివేసి పార్కింగ్ [more]

మాజీ మంత్రి, ప్రస్తుత శాసన సభ్యుడు రెడ్యా నాయక్ పై హై కోర్టు లో పిల్ దాఖలైంది. తన ఇంటిముందు ఉన్న స్కూల్ ని కూల్చివేసి పార్కింగ్ కి వాడుకున్నారని ఆరోపణలతో పిల్ దాఖలు చేశారు.ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రభుత్వం కొనుగోలు చేసిన 3 ఎకరాల స్థలాన్ని కబ్జా చేసారని పిటిషన్లో పేర్కొన్నారు. తన భార్య, ఇద్దరు కొడుకుల పేర్లను మార్చి మొదటి విడతలో ఇందిరమ్మ గృహాలు పొందారని వెల్లడించారు. ఉపాధిహామీ పథకం కింద తన పేరు పై ఉన్న భూమిని కొడుకు పేరుపై ఉన్నట్లు చూపించి నిధులు పొందారని చెప్పారు. పిటిషన్ వేసిన డి.ఎస్.వెంకన్న నాయక్ రెడ్యానాయక్ సొంత గ్రామస్థుడు(మంచ్య తండా,ఉగ్గం పల్లి గ్రామం, చిన్నగూడూరు మండలం, మహబూబాబాద్ జిల్లా) . ఈ పిటిషన్ పై విచారణకు స్వీకరించిన హైకోర్టు. పూర్తి వివరాలు ఇవ్వాలని హోంశాఖకు ఆదేశించింది. తదుపరివిచారణ ఫిబ్రవరి ఐదుకు వాయిదా వాయిదా వేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

