Mon Feb 10 2025 09:39:16 GMT+0000 (Coordinated Universal Time)
హైకోర్టు రిటైర్డ్ జడ్జిపై వేధింపుల కేసు
హైకోర్టు విశ్రాంత జడ్జి నూతి రామ్మోహనరావుపై కేసు నమోదైంది. ఆయన కోడలు సింధు ఫిర్యాదు మేరకు ఆయనతో పాటు ఆయన కుమారుడు, భార్యపై పోలీసులు కేసు నమోదు [more]
హైకోర్టు విశ్రాంత జడ్జి నూతి రామ్మోహనరావుపై కేసు నమోదైంది. ఆయన కోడలు సింధు ఫిర్యాదు మేరకు ఆయనతో పాటు ఆయన కుమారుడు, భార్యపై పోలీసులు కేసు నమోదు [more]

హైకోర్టు విశ్రాంత జడ్జి నూతి రామ్మోహనరావుపై కేసు నమోదైంది. ఆయన కోడలు సింధు ఫిర్యాదు మేరకు ఆయనతో పాటు ఆయన కుమారుడు, భార్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. తన భర్త వశిష్ట, మామ రామ్మోహనరావు, అత్త దుర్గాజయలక్ష్మీ తనను వేధిస్తున్నారని, విపరీతంగా కొడుతూ హింసిస్తున్నారని సింధు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆమె అపోలో ఆసుపత్రి వైద్యులు ఇచ్చిన నివేదికను సైతం పోలీసులకు అందజేశారు. దీంతో ఆమె ఫిర్యాదు, ఆసుపత్రి నివేదిక మేరకు సీసీఎస్ పోలీసులు గృహహింస సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నారు.
Next Story