Thu May 02 2024 01:38:12 GMT+0000 (Coordinated Universal Time)
టీడీపీ ఎమ్మెల్యే బోండాపై కేసు నమోదు
ఎన్నికల ప్రచారంలో రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడంతో పాటు దౌర్జన్యానికి దిగిన విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావుపై కేసు నమోదైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా బోండా ఉమా, [more]
ఎన్నికల ప్రచారంలో రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడంతో పాటు దౌర్జన్యానికి దిగిన విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావుపై కేసు నమోదైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా బోండా ఉమా, [more]
ఎన్నికల ప్రచారంలో రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడంతో పాటు దౌర్జన్యానికి దిగిన విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావుపై కేసు నమోదైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా బోండా ఉమా, ఆయన కుమారులు సిద్ధార్థ, రవితేజ రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు. పారిశ్రామికవేత్త కోగంటి సత్యంపై ఏకంగా బోండా ఉమ దౌర్జన్యానికి దిగారు. నీ అంతు చూస్తా అని ఆయనను బెదిరించారు. దీంతో బోండా ఉమాపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బోండా ఉమతో పాటు ఆయన కుమారుడు సిద్ధార్థ, రవితేజపై కేసు నమోదు చేశారు.
Next Story