Thu Jan 29 2026 00:22:22 GMT+0000 (Coordinated Universal Time)
అమిత్ షాతో మీటింగ్ ఫిక్స్
రాజధాని ప్రాంత రైతులు ఈ నెల 15వ తేదీన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలవనున్నారు. అమిత్ షా హైదరాబాద్ వస్తున్న సందర్భంగా ఆయనను అక్కడే [more]
రాజధాని ప్రాంత రైతులు ఈ నెల 15వ తేదీన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలవనున్నారు. అమిత్ షా హైదరాబాద్ వస్తున్న సందర్భంగా ఆయనను అక్కడే [more]

రాజధాని ప్రాంత రైతులు ఈ నెల 15వ తేదీన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలవనున్నారు. అమిత్ షా హైదరాబాద్ వస్తున్న సందర్భంగా ఆయనను అక్కడే కలిసేందుకు అపాయింట్ మెంట్ తీసుకున్నారు. అమిత్ షా కూడా రాజధాని రైతులు కలిసేందుకు సమయం ఇచ్చినట్లు తెలిసింది. అమిత్ షా ఈ నెల 15వత తేదీన సీఏఏ అనుకూల బహిరంగ సభలో ప్రసంగించేందుకు హైదరాబాద్ రానున్నారు. అయితే కొందరు జేఏసీ నేతలు కిషన్ రెడ్డిని కలిసి అమిత్ షా అపాయింట్ మెంట్ కోరినట్లు తెలిసింది. కిషన్ రెడ్డి అమిత్ షాతో అపాయింట్ మెంట్ ఫిక్స్ చేశారని చెబుతున్నారు. కాగా రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ రైతుల చేస్తున్న ఆందోళన 78వ రోజుకు చేరుకుంది.
Next Story

